
హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ దుర్ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదన చెందాను. బాధిత కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. క్షతగాత్రులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నాను.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి
ఆంధ్ర ప్రదేశ్